గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:16
 Complete the development works on time GWMC Commissioner Pravinya

హనుమకొండ, సెప్టెంబర్19, (ప్రజాజ్యోతి)../ మహా నగరంలో కొనసాగుతున్నఅభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా  పూర్తి చేయాలని జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం జిడబ్ల్యూ ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను బిల్లుల చెల్లింపు నిమిత్తం, కొత్తగా ప్రతిపాదించిన అభివృద్ధి పనులను పరిశీలించారు. 61 డివిజన్ లోని ప్రశాంత్ నగర్, 62 వ డివిజన్లోని మడికొండ ప్రాంతాల్లో నిర్మించిన అంతర్గత రోడ్లు, మురుగుకాలువలను 46 డివిజన్ లోని మడికొండ లో నిర్మించిన కమ్యూనిటీ హల్ ను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని లేనిచో బిల్లులో కోత విధిస్తామని అన్నారు.
అనంతరం 61 డివిజన్ లోని ప్రశాంత్ నగర్ ప్రాంతంలో నిర్మించనున్న ప్రతిపాదిత అభివృద్ధి పనుల ప్రదేశాలను పరిశీలించారు. కమిషనర్ వెంట బల్దియా ఇంచార్జి ఈఈ రవికుమార్,  డి ఈ సంతోష్ బాబు, ఏ ఈ హరి, ఇస్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.