మహాదేవపూర్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి; మహాదేవపూర్ లో మంగళ వారం దివ్యాంగుల శిబిరం నిర్వహిస్తామని, అర్హులైన దివ్యాంగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీపీ బి. రాణీ బాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహాదేవపూర్ మండల పరిషత్ కాంప్లెక్స్ లో నిర్వహించే దివ్యాంగుల శిబిరంలో మహాదేవపూర్, కాటారం, పలిమెల, మలహర్, మహాముతారం మండలాలకు చెందిన వారు పాల్గొని కృత్రిమ అవయవాలు పొందాలని ఎంపీపీ పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలీం అండ్ కో సహకారంతో డివ్యాంగులకు వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు, చేతులు, ట్రై సైకిల్ లు, విల్ చైర్ లు అందజేస్తారనీ, సదరం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు వెంట తీసుకురావాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- 1 view