మునుగోడులో నీలి జెండా ఎగరడం ఖాయం

Submitted by Upender Bukka on Wed, 21/09/2022 - 11:43
A blue flag is sure to fly in front

ప్రజా జ్యోతి నాగారం 20 సెప్టెంబర్.../  రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో నీలి  జెండా ఎగరడం ఖాయమని బహుజన సమాజ్ పార్టీ నాగారం మండల అధ్యక్షుడు ఎర్ర రాంబాబు అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో    మునుగోడు లో నిర్వహించ బోయే సభకు నాగారం మండలం నుండి అధికంగా దళిత శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో అగ్రవర్ణ పార్టీల కు  దీటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలను ఏకం చేస్తూ బహుజన రాజ్యాధికారం కోసం రాష్ట్రం నలుమూలల నుండి మునుగోడుకు తరలి రానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కమటం శోభ , మనీషా, బాలస్వామి, దాసరి శ్రావణ్ ,వీరన్న ,శేఖర్, యాకోబు, వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.