టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ కు ర్యాలీ.

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:08
Bike rally under the auspices of TRS party.

పాల్గొన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

అచ్చంపేట సెప్టెంబర్ 23. ప్రజా జ్యోతి. పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతు బంధు ఇచ్చేందుకు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో జారీ చేయడంతో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణం నుంచి పదరా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొని బైక్ పైన అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బైకుపై ర్యాలీ ద్వారా పదరా వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 10 శాతం రిజర్వేషన్ గిరిజన బంధు దీంతోపాటు గిరిజనులకు పోడు భూముల పట్టాలు రైతుబంధు పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఇందుకోసం జీవో కూడా జారీ చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సందర్భంగా ఆయన పేర్కొన్నారు ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి హార్నిశలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు పదరా మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు మంత్రియా నాయక్ రాంబాబు మున్సిపల్ మాజీ చైర్మన్ తులసి రామ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్బైక్ పై ర్యాలీగా వెళుతున్న ఎమ్మెల్యే బాలరాజు.