గుర్తుతెలియని వ్యక్తి బంగారం అపహరణ

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 10:15
Abduction of gold by unidentified person

దేవరకొండ -సెప్టెంబర్ -13(ప్రజా  జ్యోతి) డిండి మండల కేంద్రంలోని గోన బోయినపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం నన్ను ఒక గుర్తు తెలియని వ్యక్తి బండి ఎక్కించుకొని ఎర్రగుంటపల్లి  నుండి బోనబోయినపల్లి వరకు దింపుతానని తీసుకొచ్చి శివారులో దింపి నా మెడలో బంగారాన్ని బలవంతంగా లాక్కొని వెళ్లాడు. అని చెప్పింది. వెళుతూ మార్గమధ్యంలో అదే గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళ   దగ్గర  గుండ్ల తాడును తీసుకెళ్లాడు.ఈ విషయాన్ని ఇరువురు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ల ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.