యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 14:47
Youth should excel in sports along with studies

టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి

జిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కల్వకుర్తి,సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి).///...యువత చదువుతూ పాటుక్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు కల్వకుర్తి పట్టణంలోని మినీ స్టేడియంలో జి.ఎస్.ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభగల క్రీడాకారులకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి స్నేహభావంతో ముందుకు సాగాలన్నారు యువత సామాజ హితం కోసం రాజకీయ రంగంలోకి అడుగు వేయాలన్నారు యువకుల పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు కార్యక్రమంలో సర్పంచి గోరేటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మకొండ రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుభాష్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, జిఎస్ఆర్ యువసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు