హుజూర్ నగర్, సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి).///...ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణం లో వెలుగుచూసింది.హుజూర్ నగర్ ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ముడొత్తుల పృధ్వీరాజ్ తండ్రి శ్రీనివాస్,వయసు.28 సం.రాలు అను అతను గత కొన్ని సంవత్సరాలుగా ఖమ్మంలోని ఇందుస్ బ్యాంక్ నందు రికవరీ ఏజెంట్ గా పని చేస్తున్నాడనీ.సోమవారం సాయంత్రం డ్యూటీ నుండి ఇంటికి వచ్చి,ఆ రాత్రి ఇంట్లోనే పడుకొని మంగళ వారం ఉదయం 7.00 గంటల సమయంలో మృతుడు చెల్లెలు భార్గవి కి జాగ్రత్తగా ఉండమని మెసేజ్ పేట్టి ఇంట్లో ప్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుని చెల్లెలు చిమట భార్గవి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి పిఎమ్ఈ అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
- 13 views