అచ్చంపేట ప్రాంతంలో బిజెపి పార్టీ ప్రతిష్ఠతకు కృషి

Submitted by sridhar on Thu, 08/09/2022 - 09:49
Working for the prestige of the BJP party in Atchampet region
  • అచ్చంపేట బిజెపి నాయకుడు శ్రీకాంత్ బీమా
  • చెన్నారంలో 50 మంది బిజెపిలో చేరిక

అచ్చంపేట సెప్టెంబరు 7 ప్రజా జ్యోతి ; అచ్చంపేట ప్రాంతంలో బిజెపి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అచ్చంపేట బిజెపి నాయకుడు శ్రీకాంత్ భీమా అన్నారు బుధవారం బల్మూరు మండలంలోని చెన్నారం గ్రామంలో మల్లేష్ యాదవ్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు శ్రీకాంత్ బీమా సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బిజెపి మండల అధ్యక్షులు పెద్దయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శ్రీకాంత్ బీమా మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతుందని రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు అచ్చంపేట నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు అన్ని మండలాల్లో గ్రామాలలో తిరిగి పార్టీ పటిష్టతకు అందరితో కలిసి ఐక్యంగా వెళ్లడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ రావు తాలూకా నాయకులు శ్రీను నాయక్ రమేష్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.