మీ డబ్బు ఎక్కడకు పోతుంది..??

Submitted by Praneeth Kumar on Sat, 16/12/2023 - 09:55
Where will your money go..??

మీ డబ్బు ఎక్కడకు పోతుంది..??
◆ మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం, చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఖమ్మం, డిసెంబర్ 16, ప్రజాజ్యోతి.

టిఎస్ఆర్టిసిలో స్త్రీలకు ఉచితం అంటే స్త్రీలందరికి సంతోషమే. మరీ మధ్య తరగతి, మరీ పేద వర్గానికి ఇది మంచి వరమే. మనలాంటి వారికి ఇది హాస్యము. ఒక సారి ఈ క్రింద విష్యం విపులంగా వుంది చదవండి. ఏది సముచితమో మనకు ఓ అవగాహన వస్తుంది.
మన భారతదేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యే జీతభత్యంతో కలిపి నెలకు రెండు లక్షలు ఖర్చు చేస్తారు. వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు. దీని ప్రకారం సంవత్సరానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైమాటే.
భారతదేశంలో లోక్‌సభ, రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపిలు ఉన్నారు. ఈ ఎంపిలకు జీతభత్యంతో కలిపి నెలకు ఐదు లక్షలు ఇస్తారు. అంటే మొత్తం ఎంపిల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. ఇక ప్రతి సంవత్సరం ఈ  ఎంపిలకు జీతభత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు. అంటే భారతదేశంలోని ఎమ్మెల్యేలు, ఎంపి లు ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల 660 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది వారి ప్రాథమిక వేతనం, భత్యానికి సంబంధించిన విషయం.
వారి నివాసం, జీవనం, ఆహారం, ప్రయాణ భత్యం, చికిత్స, విదేశీ విహార యాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే. అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపిల కోసం దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.
ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి. ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు, ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు. 7 గురు పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ 2 లక్షల 45 వేలు. దీని ప్రకారం 4,582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు. అదే విధంగా ఎంపిల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. జెడ్ కేటగిరి భద్రతా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి భద్రత కోసం దాదాపు 16,000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరిస్తారు. దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ 776 కోట్లు. ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేల కోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు. అంటే ఏటా కనీసం 50 వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు, మాజీ నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు. అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.

◆ ఇప్పుడు ఆలోచించండి..??
మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది. ఇదా ప్రజాస్వామ్యం. (ఈ 100 బిలియన్ రూపాయలను మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబదుతుంది). ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది. భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.

◆ మొదటిది:        
ఎన్నికల ప్రచారం పై నిషేధం
నాయకులు టెలివిజన్ (టివి) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి. ప్రచార ఖర్చు ఒకరికి 10 వేలు మాత్రమే.

◆ రెండవది:       
నాయకుల జీతాలు, ఉచితాలు, సబ్సిడీలు మరియు అలవెన్సుల పై నిషేధం విధించాలి 
అప్పుడు కనబడుతుంది రాజకీయ నాయకుల్లో సేవ చేసే గుణం, దేశభక్తి ఎవరికి ఎంతుందో.
ప్రతి భారతీయుడు ఈ రాజకీయ నాయకుల అనవసర, అంతు లేని ఖర్చు, వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లో లాంటి క్యాంటీన్ తెరవండి, తగాదాలన్నీ అయిపోతాయి.
మీకు రూ 29 కే ఫుల్ మీల్స్ లభిస్తుంది. 80% ప్రజల కోసం, ఇంటిని నడిపే పోరాటం గుర్తుంది. సిలిండర్, రేషన్ తీసుకురావడం వుండదు. ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంటది, చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం. అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు రూ 1కి కిలో గోధుమలు బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి చెప్పనవసరం లేదు. ఇది అహంకారమా లేక మోసమా, లేక గుత్తాధి పత్యమా. భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే అదే ఢిల్లీ లో వున్న భారత పార్లమెంట్ లో ని క్యాంటీన్ లో
టీ ₹ 1
సూప్ ₹ 5.50
పప్పు ₹ 1.50
ఆహారం ₹ 2.00
చపాతీ ₹ 1.00
చికెన్ ₹ 24.50
దోస ₹ 4.00
బిర్యాని ₹ 8.00
చేప ₹ 13.00
ఈ వస్తువులన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పార్లమెంటు సభ్యులకు, ఎంపీలకు, అందులో పనిచేసే వారికి మనమందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వారికి మనం ఇస్తున్న దాన ధర్మం. ఆలోచించండి మనం వేసిన ఓట్లతో గెలిచి, దర్జాలు అనుభవిస్తూ మనం పెట్టిన భిక్ష తిని, మనం ఇచ్చే ఆరోగ్యం పొంది,మనం ఇచ్చే కార్లలో తిరుగుతూ వారి కుటుంబాలతో జల్సాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మనకు మోసం చేస్తూ, మనకు ఇబ్బంది కలిగితే కంటి చూపుకు కూడా కనిపించని రాజకీయ నాయకుల జీవితం ఇది. ప్రజలు ఎన్నుకున్న ఏ నాయకులు అయినా పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే. ఈ విషయం మెదడులో పెట్టుకుని నాయకులు పని, కాదు.. కాదు సేవ చేయాలి. రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించే వాడు భికారి, పేదవాడు కాదని వారు భావించడానికి కారణం ఇదే. మెరా భారత్ మహాన్ ఎవరి చేతుల్లో వుందో ఆలోచించండి.