కాజీపేట, సెప్టెంబర్ 24 (ప్రజాజ్యోతి)..// బిజెపి లోకసభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా మడికొండ టెక్స్ టైల్ పార్క్ సందర్శించడానికి వచ్చిన కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మకు హనుమకొండ జిల్లా నాయకులు పొనగోటి వెంకట్ రావు అధ్వర్యంలో మడికొండ చౌరస్తాలో బిజెపి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బన్న ప్రభాకర్, కొండి జితేందర్ రెడ్డి, గడ్డం మహేందర్, భైరపాక వెంకటేష్ , చందర్రాజు భూపాల్, బైరి సతీష్, తక్కలపల్లి నిఖిల్ రావు, మదాసు ప్రణయ్, ధరావత్ సునీల్, ఏర్పుల సదానందం, గడ్డం శ్రీధర్, గడ్డం కిరణ్, బుర్ర నరేష్, అల్వాల కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
- 4 views