పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

Submitted by srinivas on Wed, 28/09/2022 - 12:59
 Volleyball tournament under the auspices of the police

రేగొండ, సెప్టెంబర్27 ప్రజాజ్యోతి :  రేగొండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల ఆవరణంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈపోటీలను రేగొండ  ఎస్ఐ శ్రీకాంత్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత ఆ టలను జీవితంలో ఒక భాగంగా పెట్టుకొని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు. మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.