వెంకటేష్ కు గురుబ్రహ్మ అవార్డు ప్రదానం

Submitted by Sukka.ganesh on Tue, 13/09/2022 - 10:20
Venkatesh was awarded the GuruBrahma Award

యాదాద్రి(ప్రజాజ్యోతి)సెప్టెంబర్ 12 ప్రజాజ్యోతి న్యూస్: మండల కేంద్రంలోని గాయత్రి ఉన్నత పాఠశాల డైరెక్టర్,ట్రస్మా అసోసియేట్ అధ్యక్షులు పాలకుర్ల వెంకటేష్ కు 75 వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భముగా హైదరాబాద్ ఉప్పల్ లోని బచ్పన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో అబ్దుల్ కలాం లీడ్ ఇండియా చైర్మన్ డాక్టర్ ఆచార్య సుదర్శన్ చేతుల మీదుగా గురుబ్రహ్మ అవార్డును సోమవారం వెంకటేష్ కు అందజేశారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడంతో తనకు మరింత భాద్యత పెరిగిందని అన్నారు.అవార్డు అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.