కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి,,..కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని తలకొండపల్లి మండలం పూర్వపు వెంకట్రావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని నూతన గ్రామపంచాయతీ గడ్డమీద తండా గ్రామపంచాయతీ ఆర్లకుంట తాండ సమీపంలో బాణావత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తాటికుంట మైసమ్మ దేవాలయ నిర్మాణానికి తలకొండపల్లి జెడ్పిటిసి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ సహకారంతో బుధవారం దేవాలయ స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. గిరిజనుల ఆత్మ అభిమానాలను గౌరవిస్తూ తాము కొలిచే తాటికుంట మైసమ్మ దేవాలయ నిర్మాణానికి కావలసిన సిమెంటు, ఇసుక, కంకర, స్టీల్, అందజేసిన తలకొండపల్లి జడ్పిటిసి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ వి కన్స్ట్రక్షన్ అధినేత, ఉప్పల వెంకటేష్ కు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాములు నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు.
- 1 view