డీసీఎంను ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి ఆర్టీసి బస్సును ఢీకొట్టిన టూ వీలర్ ఇద్దరూ మృతి ఒకరికి తీవ్రగాయాలు

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:07
Two wheeler killed, one seriously injured when RTC bus overtaking DCM collided with it

 అలంపూర్: సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి)  ఇటిక్యాల: డీసిఎం వాహనాన్ని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయిన ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది  ఈ ప్ర‌మాదంలో ఇద్దరూ మృతి చెందగా  మరొక్కరికి గాయాలయ్యాయి  ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఇటిక్యాల ఎస్ఐ గోకారి స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అయిజకు మండలానికి చెందిన మహేశ్వర్ రెడ్డి  చంద్రకళ  మంజుల ముగ్గురు కలిసి‌  ఏపీ21 ఎబి 2579 ద్విచక్రవాహనంపై శనివారం ఉదయం గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తాకు వెళ్లే క్రమంలో ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో గోశాల వద్ద ముందుగా వెళ్లుతున్న ఓ డీసిఎంను ఓవర్ టేక్ చేశారు  అదే సమయంలో వనపర్తి నుంచి గద్వాలకు వ‌స్తున్న ఆర్టీసి‌ బస్సును ఢీ కొట్టగా వాహనం నడిపే వ్యక్తి మహేశ్వర్ రెడ్డి తో పాటు చంద్రకళ అనే మహిళ మృతి చెందింది  ఇటిక్యాల ఎస్ఐ గోకారి పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు  గాయపడిన మంజులను వైద్య చికిత్స నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు  మృత‌దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి మార్చురికి త‌ర‌లించారు 

మృతి చెందిన చంద్రకళ ఐజ పట్టణం టీచర్స్ కాలనీకి చెందింది   గద్వాలలోని శుభకర హాస్పిటల్ లో ఏఎన్ఎం గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది  టు వీలర్ నడుపుతున్న మహేశ్వర్ రెడ్డి మృతి చెందగా  అయిజ మండలం గూడిదొడ్డి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిగా గుర్తించారు  గాయపడిన  మంజులను తనగల గ్రామానికి గుర్తించారు పూర్తి సమాచారం తెలిపిన  ఎస్ ఐ గోకరి..