నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు

Submitted by Yellaia kondag… on Tue, 27/09/2022 - 14:47
TRS leaders paid their respects

తుంగతుర్తి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వీరబోయిన రాములు తండ్రి పోలరాజు  అనారోగ్యంతో మంగళవారం మరణించారు. అతని పార్థివ దేహానికి మండల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీతయ్యతో పాటు టిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ-2 చెరుకు సృజన పరమేష్, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ గౌడ్, ఎల్లబోయిన బిక్షం, పూసపల్లి శీను, అక్కినపల్లి రాములు, ఆకారపు భాస్కర్, ఆకారపు ముత్యలింగం, మెత్తబోయిన లింగయ్య పలువురు కార్యకర్తలు,  తదితరులున్నారు.