తాండూరు సెప్టెంబర్ 26 ప్రజా జ్యోతి:- తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 127వ జయంతిని తాండూర్ మండలం చెంగోల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూర్ మండలం చెంగోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహానికి తాండూర్ జెడ్పీటీసీ గౌడీ మంజుల పలువురు రజక సంఘం ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు దొరలను ఎదిరించి భూస్వాములకు ఎదురు తిరిగిన వీర వనిత కులవృత్తిని కాదని వ్యవసాయాన్ని నమ్మిన చాకలి ఐలమ్మ నేటి రైతుల అందరికీ ఆదర్శవంతురాలని చెప్పారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెంగోల్ మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం, రజక సంఘం నాయకులు చాకలి వెంకటయ్య, సిహెచ్ నరేష్, బడ్డప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- 21 views