తెలంగాణ సాయుధపోరాట అమరులకు నివాళులు

Submitted by sudhakar on Mon, 19/09/2022 - 12:10
Tributes to Telangana armed struggle martyrs

 అడ్డగూడూరుసెప్టెంబర్18 ( ప్రజా జ్యోతి) .. / అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కామ్రేడ్ మందుల చంద్రయ్య ఆలియాస్ లేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ మందుల సామేలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి అరాచకాలను రజాకార్లను పోలీసులను ఎదురించి పోరాటం చేసి నైజాం పరిపాలను గద్దెదించిన పోరాటం లేవి తన గ్రామవాసీకావడం గర్వంగా ఉందన్నారు. లేవి స్వాతంత్ర్య పెన్షన్ కోసం తిరిగిన పెన్షన్ మంజూరు కాలేదు పది సంవత్సరాక్రితం మరణించారు ఆయన జ్జాపకార్దం కుటుంబికులు గ్రామంలో బస్ స్టాప్ లో షెల్టర్ ఏర్పాటు చేశారు.తెలంగాణ సాయుధ పోరాటం గొప్పతనం వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామస్తులు మేకల దాసులు,మేకల ఇమ్మానియల్ ,లాదినేని పూర్ణయ్య, మందుల ఉదయ్ కిరణ్ ,వెంకన్న ,బాల్నెబిక్షం ,మందుల లక్ష్మయ్య, చీమల చంద్రయ్య, మందుల అంజయ్య, పెదసోమయ్య, ధశరధ, చింతనాగయ్య, మందుల సైదులు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు .