నేడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Submitted by mallesh on Mon, 19/09/2022 - 14:57
Today he will participate in the spiritual gathering of TRS party workers  Minister Jagadishwar Reddy

 చౌటుప్పల్ సెప్టెంబర్ 18;;  టిఆర్ఎస్ పార్టీ  పదివేల మంది పట్టణ గ్రామాల కార్యకర్తలతో  మంగళవారం నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళన సమావేశం పనులను మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ వలిగొండ రోడ్డు లోని రైతు వేదిక ఆవరణంలో నిర్వహించను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు  ఈ సమావేశంలో  విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్రెడ్డి తోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొంటారని తెలిపారు,  మంత్రి జగదీశ్వర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి వనభోజనాలు చేస్తారని పేర్కొన్నారు, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రాముఖ్యతను ప్రజలకు వివరించనున్నారని తెలిపారు . ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ పట్టణ శాఖ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి , తడక చంద్ర కిరణ్, కౌన్సిలర్ సుల్తాన్ రాజు, కొరగొని లింగస్వామి, తాడూరు పరమేష్ ,ఉడుగు మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.