కర్ర సాము చేసి గులాబీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిన ఎమ్మెల్యే
తుంగతుర్తి, సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి)../..// మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తెరాస పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన భారీ బతుకమ్మల ర్యాలీ లో తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ డీజే పాటలకు అనుగుణంగా తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టి, కర్ర సామచేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కార్యకర్తలతో కలిసి అదిరేటి స్టెప్పులు వేస్తూ.. అందర్నీ అలరించి గులాబి శ్రేణులలో ఫుల్ జోష్ నింపారు.