ఆలయ ప్రథమ వార్షికోత్సవ
కరపత్రాల విడుదల
-ఆలయ గౌరవ అధ్యక్షుడు మచ్చ నరేందర్
బచ్చన్నపేట. అక్టోబర్ 20, (ప్రజాజ్యోతి)
మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయ ప్రధమ వార్షికోత్సవ కరపత్రాలను విడుదల చేసినట్లు దేవాలయ కమిటీ శాశ్వత గౌరవ అధ్యక్షుడు మచ్చ నరేందర్, ఉపాధ్యక్షులు గుర్రపు బాలరాజు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఆలయ ప్రాంగణంలో కరపత్రాలను
విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ మూడవ తేదీ నుండి 4వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ వార్షికోత్సవానికి భక్తులు
అధిక సంఖ్యలో హాజరై భక్త మార్కండేయ స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బేతి కృష్ణమూర్తి, కమిటీ సభ్యులు గుండా కేశవులు, కుడికాల లక్ష్మణ్, సిద్దిరాములు, కృష్ణమూర్తి, ఆనంద్, మురళి,
శ్రీహరి, వెంకటేశ్వర్లు, నాగేష్, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.