ఈ నెల 25వ తేదిన పాలకుర్తి సోమన్న గుడి మూసివేత,  ఆలయ ఈవో రజనీ కుమారి

Submitted by lenin guduru on Sun, 23/10/2022 - 17:46
రజనీ కుమారి

ఈ నెల 25వ తేదిన పాలకుర్తి సోమన్న గుడి మూసివేత 

ఆలయ ఈవో రజనీ కుమారి

పాలకుర్తి, అక్టోబర్ 23, (ప్రజాజ్యోతి):-
 సూర్య గ్రహణం సందర్భంగా  ఈనెల 25న  మంగళవారం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం (సోమన్న గుడి) మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో  నండూరి రజనీ కుమారి  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.25న ఉదయం 6 గంటలకు  స్వామివారికి నిత్యపూజలు ,మహాభిషేకం  నిర్వహించి ఆలయ ముఖ ద్వార బంధనం (మూసివేత) చేయనున్నట్లు  ఈవో తెలిపారు. తిరిగి 26న  బుధవారం  ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ,స్వామివారికి అభిషేకం, అలంకరణ నిర్వహించిన అనంతరం ఉదయం  6 గంటల నుంచి  భక్తుల దర్శనానికి అనుమతిస్తామని,ఆర్జిత సేవలు కొనసాగుతాయని  ఈవో  పేర్కొన్నారు.  భక్తులు గమనించి  తమకు సహకరించాలని  కోరారు.