ఈ నెల 25వ తేదిన పాలకుర్తి సోమన్న గుడి మూసివేత
ఆలయ ఈవో రజనీ కుమారి
పాలకుర్తి, అక్టోబర్ 23, (ప్రజాజ్యోతి):-
సూర్య గ్రహణం సందర్భంగా ఈనెల 25న మంగళవారం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం (సోమన్న గుడి) మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో నండూరి రజనీ కుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.25న ఉదయం 6 గంటలకు స్వామివారికి నిత్యపూజలు ,మహాభిషేకం నిర్వహించి ఆలయ ముఖ ద్వార బంధనం (మూసివేత) చేయనున్నట్లు ఈవో తెలిపారు. తిరిగి 26న బుధవారం ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ,స్వామివారికి అభిషేకం, అలంకరణ నిర్వహించిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తామని,ఆర్జిత సేవలు కొనసాగుతాయని ఈవో పేర్కొన్నారు. భక్తులు గమనించి తమకు సహకరించాలని కోరారు.