కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి.//..తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కల్వకుర్తి నియోజకవర్గనికి చెందిన సొంతం శశి కుమార్ గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకూర మహేష్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా శశి కుమార్ గౌడ్ మాట్లాడుతూ నా పై నామకం తో నాకు ఈ పోస్ట్ ఇచ్చినటువటి సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు పాలకూర మహేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ అన్ని వేళల్లో వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ నిర్వాహకుల అభ్యున్నతి కోసం కృషి చేసినట్లు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రవేశ హాస్పిటల్ నిర్వాహకుల సమస్యలు తీసుకెళ్లి వారి సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ఉన్నట్లు శశి కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికైన శశి కుమార్ గౌడ్ ను కల్వకుర్తి నియోజకవర్గం ప్రాంతానికి చెందిన నేతలు కార్యకర్తలు అభినందించారు..
ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, బాను,అశోక్, శివ తదితరులు పాల్గొన్నారు.
- 3 views