Nampally

బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ

Submitted by Sathish Kammampati on Wed, 21/09/2022 - 12:54

నాంపల్లి, సెప్టెంబర్ 21(ప్రజా జ్యోతి)నల్లగొండ జిల్లా:  కాంగ్రెస్ కంచుకోట లో మునుగోడు గెలుపు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్ రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఎంతోమంది కార్యకర్తలకు నాయకులుగా తయారు చేసి ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా అండగా నిలిచి పేద ప్రజలకు సేవ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని  పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి కాంగ్రెస్ గెలుపుకు నాంది పలకాలని అన్నారు.