మల్దకల్ తిమ్మప్ప స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 26 : హరిహరాదుల క్షేత్రం మల్దకల్ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీదేవి అమ్మవారిని, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం మొదటి రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేసి, పూజలు నిర్వహించారు. అర్చకులు, వాల్మీకి పూజారుల ఆధ్వర్యంలో రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు సదుపాయాలు కల్పించారు.