సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఃసీఈ శ్రీకాంతరావు
నిడమనూరు,సెప్టెంబర్ 20,(ప్రజాజ్యోతి): నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంగళవారం సాయంత్రం సీఈ శ్రీకాంతరావు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈ శ్రీకాంతరావు మాట్లాడుతూ నాగార్జున ఎడమ కాలువ పరిధిలోని 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఈనెల 07వతేదిన సాయంత్రం ఎడమ కాలువ గండి పండి నేటికీ 14రోజులు అవుతుంది.గండి మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మళ్లీ మంగళవారం సాయంత్రం ఎడమ కాలువ కు 2వేలక్యూసెక్యూల నీటిని దశలవారీగా కాలువకు నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలకు సాగు నీరు వెళ్లుంది.