పే స్కేల్ జీవో వచ్చే దాకా సమ్మె విరమించేది లేదు

Submitted by bosusambashivaraju on Wed, 21/09/2022 - 15:57
The strike will not end until the pay scale is revised


స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 21 ( ప్రజాజ్యోతి ) :-  తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు ఘనపూర్ స్టేషన్  మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. బుధవారం వి ఆర్ ఎ జె ఎ సి మండల ప్రధాన కార్యదర్శి ఎలిశాల రాము మాట్లాడుతూ ప్రభుత్వం విఆర్ఎ లకు పేస్కెల్ జీవో ను వెంటనే విడుదల చేయాలి.  అర్వత కలిగిన విఆర్ఎ లకు ప్రమోషన్స్ కల్పించాలి. 55 సంవత్సరములు నిండిన విఆర్ఎ ల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలి ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని, పే స్కేల్ జీవో వచ్చే దాకా సమ్మె విరమించే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో  కోశాధికారి శివ, రమ్య జ్యోతి, యాదేశ్, వెంకట్రజం, అభి, రాజు కుమార్, సృజన్, పోతరాజు, అశోక్, మహేశ్వరి, బాషబోయిన రాజు లు పాల్గొన్నారు.