నల్లగొండ సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి) ./... రెండవ రోజు రాష్ట్ర స్థాయిలో ఘర్షణ పోటీలలో నల్లగొండ లోని వెంకట్ రెడ్డి ఫంక్షన్హాల్లో మహాత్మాగాంధీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ ఎస్ గోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ వ్యక్తిపై శారీరక మానసిక ఆరోగ్యం ను కాపాడటంలో యోగా చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని అన్నారు.ఈ సంవత్సరం నుండి ఇంటర్ కాలేజ్ గేట్ టోర్నమెంటులో పోటీలలో యోగాను చేసినట్లు చెప్పారు.మహాత్మాగాంధీ యూనివర్శిటీలో యోగా కోర్సులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.జిల్లా అధ్యక్షులు కోట సింహాద్రి మాట్లాడుతూ రెండోరోజు పోటీలన్నీ కేటగిరిలలో సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి రేపు ఫైనల్స్ నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రదానం కార్యక్రమం శాసన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చే నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నిర్వాహణ కమిటీ చైర్మెన్ బోయపల్లి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, బంధనం మహాత్మాగాంధీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి, పాల రవి, ఆకుల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాయనబోయిన శ్రీను పాల్గొన్నారు.
- 1 view