జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:24
State Agriculture Minister Niranjan Reddy presented silk clothes to Goddess Jogulamba

ఆలంపూర్,(ప్రజా జ్యోతి) అక్టోబర్ 2: ఆలంపూర్ లో, జోగులాంబ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి కి, పూల బుకే తో స్వాగతం పలికిన,అలంపూర్  శాసనసభ్యుడు డాక్టర్ వియం.అబ్రహం దంపతులు,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, ఈ సదర్భంగా వారికి ఆలయ  చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, మరియు ఈవో పురెందరు, ఆలయ అర్చకులు, పూర్ణ కుంబంతో స్వాగతం పలికారు, అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది, అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు ఆలయ చైర్మెన్   తీర్త  ప్రసాదాలను అందజేశారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దసరా నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా,జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అని అన్నారు, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర  ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగిందిఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ,మరియు అధికారులు ,మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.