గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 10 :మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవముగా జరిగింది. రాజోలి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన రామ్మోహన్ రెడ్డి దంపతులు, కర్నూలుకు చెందిన సృజన జయచంద్ర దంపతులు, గద్వాలకు చెందిన విజయలక్ష్మి కృష్ణ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం వేదమంత్రోచ్ఛారణల మధ్య వేద పండితులు రమేష్ ఆచారి, మధుసూదనాచారి, రవి, దీరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు ఆత్మకూరుకు చెందిన కవితా సత్యనారాయణ, గద్వాలకు చెందిన విజయలక్ష్మి కృష్ణ, తాటికుంట తిమ్మయ్య శెట్టి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమంలో సీతారాం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర రావు, బాదామి శ్రీనివాసులు, బ్యాంకు నాగరాజు, మద్దల బండ నాగరాజు మరియు వాల్మీకి పూజారులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమంను ప్రారంభించారు.
- 5 views