గణనాథుడికి ప్రత్యేక పూజలు

Submitted by Sathish Kammampati on Mon, 05/09/2022 - 12:28
Special Pujas to Lord Ganath

 మర్రిగూడెంలో మహా అన్నదానం  ప్రారంభించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి

    (త్రిపురారం)సెప్టెంబర్ 4(ప్రజా జ్యోతి ) ,గణనాధుని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు ఆదివారం మండలంలోని మర్రిగూడెం గ్రామంలో సర్పంచ్ బాల్తి పద్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధునికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు గణపతి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోని గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన విగ్రహాల శోభాయాత్రలో నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అనంతరం మరి గూడెం సర్పంచ్ పద్మా శ్రీనివాసులు ఎమ్మెల్సీ కోటి రెడ్డి గారికి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఆయన వెంట టిఆర్ఎస్ జిల్లా నాయకులు మారుతి భారత్ రెడ్డి టిఆర్ఎస్ మండల రైతుబంధు కోఆర్డినేటర్ అనుముల అనంతరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు