కేతేపల్లి సర్పంచి కోరే ప్రమీల యాదయ్య గడియారాలు పంపిణీ
నాంపల్లి, సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి ): మండలం కేతేపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ కోరె ప్రమీల యాదయ్య ప్రతి ఇంటి ఇంటికి గోడ గడియారాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పల్స సైదులు,వార్డు మెంబర్లు శంకర్, రవి,ఆంజనేయులు అదేవిధంగా సీనియర్ నాయకులు ఎడ్ల అంజయ్య, కృష్ణయ్య, దండిగ లింగయ్య, చేపూరు శ్రీను కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- 4 views