ఆడి పాడిన చిన్ననాటి మిత్రులు
హుజూర్ నగర్ అక్టోబర్ 2( ప్రజా జ్యోతి )./...పట్టణంలోని అనసూర్య గడ్డి రెడ్డి ఫంక్షన్ హాల్ నందు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1987- 88 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ద్వితీయ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.మిత్రులందరూ వారి వారి కుటుంబాలతో కలిసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందోత్సవాల మధ్య గడిపారు.వివిధ హోదాలలో ఉన్న అందరూ వయసును మరచి చిన్న పిల్లల మాదిరిగా ఆడి పాడారు. మహిళలకు చిన్న పిల్లలకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అంద చేశారు . కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బ్యాచ్ మిత్రుడు మెహరాజ్ కు 21 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం మహిళలు చిన్నారులు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులందరూ చిన్ననాటి జ్ఞాపకాలు నెంబర్ వేసుకొని ఆడి పారారు.
- 2 views