ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ఇస్కానింగ్

Submitted by veerareddy on Mon, 26/09/2022 - 13:44
 Scanning for pregnant women in government hospital


జైనూర్ సెప్టెంబర్ 25:(ప్రజా జ్యోతి): జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ఆల్ట్రా స్కానర్ చేయించడం జరిగిందని డాక్టర్ నాగేంద్ర అన్నారు. ఆదివారం రోజున సిర్పూర్ యు మండలానికి చెందిన 55 మంది గర్భిణీ స్త్రీలకు జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలలో అల్ట్రా సౌండ్ స్కానింగ్  చేయించి వాళ్లకు మెరుగైన వైద్యం అందించడం జరిగిందన్నారు. గర్భిణి స్త్రీలు ప్రతి నెలకు వచ్చి స్కానింగ్ చేయించుకోవాలని కోరారు. డాక్టర్ విక్రమ్ రేడియోలజిస్ట్ స్కానింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు డాక్టర్లు తదితరులున్నారు