మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ సారంగపాణి

Submitted by bosusambashivaraju on Sat, 01/10/2022 - 18:03
Sarpanch Sarangapani visited the family members of the

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 01 ( ప్రజాజ్యోతి ) :- ఘనపూర్ మండలంలోని చాగల్ గ్రామంలో ముసిని యాదగిరి మరణించారు. ఈ విషయం తెలిసి శనివారం జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టేషన్ ఘనపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోగుల సారంగపాణి వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు . అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 

వీరితో టీఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్, గాండ్ల శ్రీను, చేపూరి, రామచంద్రం, ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.