మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ సారంగపాణి.

Submitted by bosusambashivaraju on Thu, 29/09/2022 - 11:33
Sarpanch Sarangapani visited the family members of the deceased.

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 29 ( ప్రజాజ్యోతి ) :-  ఘనపూర్ మండలంలోని చాగల్లు గ్రామంలో  ఎస్సి సెల్ అధ్యక్షుడు చేపూరి కుమార స్వామి తండ్రి చేపూరి  కొమురయ్య బుధవారం సాయంత్రం మరణించారు. ఈ విషయం తెలుకున్న జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టేషన్ ఘనపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు  పోగుల సారంగపాణి గురువారం వారి పార్థివ దేహాన్ని సందర్శించి,  పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వీరితో పాటు టిఆర్ఎస్ నాయకులు ఆకుల నాగరాజు, చేపూరి కొమురయ్య, చేపూరి రామచంద్రం, భాస్కుల  నాగరాజు,  టీఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్,  కాంగ్రెస్ నాయకులు చేపూరి ప్రభాకర్, భాస్కుల, ఎల్లయ్య, ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.