నేషనల్ కాన్ఫరెన్స్ కు ఎంపికైన సర్పంచ్ ప్రత్యూష రెడ్డి

Submitted by bosusambashivaraju on Thu, 15/09/2022 - 12:33
Sarpanch Pratyusha Reddy was selected for the National Conference

చిల్పూర్  సెప్టెంబర్ 14, ప్రజా జ్యోతి: ఈనెల 15,16వ తేదీలలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరగనున్న నేషనల్ కాన్ఫరెన్స్ స్మార్ట్ గ్రామపంచాయతీలు, గ్రామీణ వర్గాల సాధికారత అనే అంశంపై జరగనున్న జాతీయ సదస్సుకు జనగాం జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి గ్రామ సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రత్యూష రెడ్డి మాట్లాడుతూ శ్రీపతి పల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుండి  నలుగురు సర్పంచులను, ఇద్దరు ఎంపీలను, ఒక జడ్పీ చైర్మన్ ను, ఎంపిక చేయగా అందులో మన జనగామ జిల్లా నుండి జనగాం జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి గ్రామ సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్ రెడ్డి  ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులతోపాటు మండల ,జిల్లా  నాయకులు ప్రతినిధులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.