రేవంత్ రెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరిన సర్పంచ్ మయూరి.

Submitted by veerareddy on Wed, 14/09/2022 - 16:53
Sarpanch Mayuri reached the house in the presence of Revanth Reddy.


అచ్చంపేట సెప్టెంబర్ 14 ప్రజా జ్యోతి. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో బల్మూర్ మండలంలోని మహాదేవుపూర్ గ్రామ సర్పంచ్ మయూరి రాంప్రసాద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి చేరారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన సర్పంచ్ తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అదేవిధంగా వార్డు సభ్యులు తోపాటు 50 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సర్పంచ్ మయూరి రాంప్రసాద్ గౌడ్ తెలిపారు అదేవిధంగా అచ్చంపేట పట్టణం వలపట్లాకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంతటి మల్లేష్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ నుంచి మహిపాల్ రెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరికీ కూడా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం  జరుగుతుందన్నారు.

పార్టీలో చేరిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ నడవడిక పద్ధతులకు ఆకర్షితులై చాలామంది పార్టీలో చేరడం జరుగుతుందన్నారు రాబోయే కాలంలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బల్మూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కటకం రఘు రాం బల్మూరు మండల నాయకులు హంక్యా నాయక్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్.రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన సర్పంచ్ తదిరులు.