స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ) : - స్టేషన్ ఘనపూర్ మండలము తాటికొండ వాగులో నుండి స్టేషన్ ఘనపూర్ కి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు జాతీయ రహదారి ప్రక్కన శ్రీవాణి స్కూల్ నందు రెండు ఇసుక ట్రాక్టర్ లను పట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా వారిని విచారించగా ఎటువంటి అనుమతి పత్రాలు లేనందున జిట్టేగుడెం గ్రామానికీ చెందిన ఇసుక ట్రాక్టర్ల ఓనర్ అయినటువంటి లకావత్ లక్ష్మణ్, ట్రాక్టర్ డ్రైవరులు అయనటువంటి భూక్య సంతోష్, భానోత్ కుమార్ లపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
- 2 views