జాతీయస్థాయి అక్షర పురస్కారానికి ఎంపికైన సామినేని శ్రీనివాసరావు

Submitted by shaikmohammadrafi on Fri, 23/09/2022 - 09:47
Samineni Srinivasa Rao was selected for the National Akshara Award

నడిగూడెం, సెప్టెంబర్ 21, ప్రజా జ్యోతి: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జాతీయస్థాయి అక్షర పురస్కారాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడిగూడెంలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్న సామినేని శ్రీనివాసరావు ఎంపికైనట్లు అక్షర ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ యాస రామ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పు నాగయ్య, ప్రధాన కార్యదర్శి పాల్వాయి వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం సూర్యాపేటలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జాతీయస్థాయి అక్షర పురస్కారం అవార్డు అందించనున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, పర్యావరణం, క్రీడలు, సాంస్కృతిక, కళ, సాహిత్య, నాట్య, పారిశ్రామిక, సామాజిక, స్వచ్ఛంద సేవా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన, సేవలందించిన నిష్ణాతులైన వారికి ఈ జాతీయ స్థాయి అక్షర పురస్కార అవార్డులో అందజేయనున్నట్లు తెలిపారు.సామినేని శ్రీనివాసరావు జాతీయస్థాయి అక్షర పురస్కార అవార్డు ఎంపికైన సందర్భంగా వారికి నడిగూడెం మండల పి ఆర్ టి యు అధ్యక్షులు కాంపెల్లి గోపి రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి బి నాగేశ్వరరావు, జడ్పీహెచ్ఎస్ నడిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శోభన్ బాబు ఉపాధ్యాయులు ఎస్.కె మీరాజుద్దీన్ , జి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, బి శ్రీనివాసరావు, శ్రీమతి అహల్యాదేవి, పర్వతాలు, లలిత, సత్యనారాయణ మరియు నడిగూడెం మండల రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, జడ్.పి.హెచ్.ఎస్ కరివిరాల ప్రధానోపాధ్యాయులు ఎస్ బ్రహ్మానందం మొదలైన వారు అభినందనలు తెలియజేశారు.