భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్24 ప్రజాజ్యోతి//'// ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి కేపీ ప్రోత్సహకాలను అడిషనల్ ఎస్పి శ్రీనివాసులు అందించారు.శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ,లావణ్య ,మహేందర్ , శ్రీనివాసచార్యులు, రాణి, కోమల , శ్వేత. ఏండి. అఫ్జల్ పాషా, సాంబశివ రావు , రాజయ్య ,
రతన్ సింగ్ రత్నాకర్, . అర్చన, సౌజన్య లకు ఆయన అవార్డులు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు. మరియు ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించారు, మరియు ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూచించారు. కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి డిపార్ట్మెంట్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కిషోర్ కుమార్, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ పెద్దన్న కుమార్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- 2 views