స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 29 ( ప్రజాజ్యోతి ) : - మండలంలోని తాటికొండ గ్రామంలో జీబీ తండా 5వ వార్డులోని గుగులోతు తేజ ఇటీవల మరణించినందున గురువారం స్టేషన్ ఘనపూర్ వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారపాక రాములు, వార్డు మెంబర్లు పండుగ లక్ష్మి అశోక్, బర్మా రాజయ్య, గ్రామ పెద్దలు భూక్యా భద్రు, రొయ్యల భూమయ్య, భూక్యా సురేష్, భూక్యా పాండు, భూక్యా నరసింహ, యూత్ నాయకులు, మారపాక యుగేందర్, మారపాక శ్రీధర్, మారపాక బాబు, భూక్యా సమ్మన్న, మారపాక శ్రీకాంత్, గ్రామ కారోబర్ మొహమ్మద్ సలీం, సిబ్బింది రచ్చ శ్రీనివాస్, భూక్య గణేష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- 6 views