నాంపల్లి, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి ): మండలం జాన్ తండా గ్రామం దోరోనిగడ్డ తండలోని టీ.ఆర్.ఎస్ పార్టీ కుటుంబానికి చెందిన మెగావత్ వస్య బుధవారం మరణించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకున్న నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ తన వంతు సాయంగా మృతుని కుటుంబానికి 10.000/- వేల రూపాయలు మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సపావత్ సర్దార్ నాయక్ ద్వారా మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి అండగా ఎల్లవేళలా ఉంటామని మనో ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు,వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
- 3 views