హనుమకొండ, సెప్టెంబర్ 07 (ప్రజాజ్యోతి) బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తీగల భరత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో సోషల్ వెల్ఫేర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి హాస్టల్ లో రోజు ఏదో ఒక సమస్య వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కూడా కెసిఆర్ కానీ విద్య శాఖ మంత్రి కానీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
ఇప్పటికైనా కెసిఆర్ స్పందించి రాష్ట్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లలో నాణ్యమైన భోజనం పెట్టె విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సారంగపని, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి పవన్, ఉపాధ్యక్షులు అడ్లురు గౌతమ్, నాగమల్లి సంతోష్,57 డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ మౌనిక, ప్రధాన కార్యదర్శి శివ, బీజేవైఎం 57డివిజన్ అధ్యక్షులు ప్రశాంత్, బీజేవైఎం నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు