గర్భిణీలకు శ్రీమంతాలు..

Submitted by veerabhadram on Thu, 15/09/2022 - 19:17
 pregnent ladies sreemantham

 ప్రజా జ్యోతి సెప్టెంబర్ 15  చండ్రుగొండ

గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించటమే అంగన్వాడీల లక్ష్యమని సిడిపిఓ నిర్మల జ్యోతి అన్నారు.గురువారం స్థానిక రైతువేదిక భవనం నందు జరిగిన పోషకార వారోత్సవాల సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేడు గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు పౌష్టికాహార సరఫరా కేంద్రాలు తయారయన్నారు. బరువు తక్కువ ఉన్న చిన్నారులను గుర్తించి పౌష్టికాహారాన్ని అందించాలని, అదేవిధంగా రక్తహీనత ఉన్న తాజా పండ్లు, కూరగాయలను అందజేయాలన్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలంటే గర్భిణీగా ఉన్నప్పుడే పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు శకుంతల, రాణి, అంగన్వాడి టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.