పోలీసుల వాహన తనిఖీలు

Submitted by srinivas on Wed, 28/09/2022 - 13:07
Police vehicle checks

పలిమెల  సెప్టెంబరు 27ప్రజాజ్యోతి.//.. మండలం  సరిహద్దు మరియు గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో మావోయిస్టులు సంచరించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రతి వాహనాన్ని పోలీసులు  క్షుణ్ణంగా పరిశీలించారు. లెంకల గడ్డ గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనపత్రాలు, వ్యక్తిగత పత్రాలు చెక్ చేసి పంపించారు. అభివృద్ధి విరోధకుల కోసం ఎలాంటి సహాయం చేయకూడదని వాహన యజమానులకు సూచించారు. అనంతరం గ్రామాల్లో డాగ్ స్క్వాడ్ తో సైతం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వాహన దారులు సరైన పత్రాలతో వాహనాలు నడపాలని తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై అరుణ్ తో పాటు సివిల్ మరియు సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.