భూపాలపల్లి క్రైమ్ సెప్టెంబర్19 ప్రజాజ్యోతి. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయoలో ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 22 మంది ఫిర్యాదుదారుల యొక్క రాతపూర్వక పిటిషన్లను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను, సమస్యల పూర్వపరాలను అడిగి తెలుసుకుని వాటిని చట్ట పరిధిలో పరిష్కరిస్తామని ఫిర్యాదుదారులకు భరోసా కల్పించారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, భూ వివాదాలు, మరియు ఇతర సమస్యల గురించి ఎస్పీ తో బాధితులు తమ సమస్యలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయా ఫిర్యాదులపై వెంటనే దర్యాప్తు చేపట్టి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఎస్పి సురేందర్ రెడ్డి ఆదేశించారు.
- 1 view