గిరిజన భవన్ ప్రారంభోత్సవానికి తరలి రావాలి: గణేష్

Submitted by bosusambashivaraju on Thu, 15/09/2022 - 12:20
People should flock to the opening ceremony of Girijana Bhavan: Ganesh

దేవరుప్పుల సెప్టెంబర్ 14, ప్రజజ్యోతి:జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) గ్రామంలో బుధవారం రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకుటిఆర్ఎస్ మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షడు ధరావత్ గణేష్ నాయక్ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాన గిరిజన ఆదివాసీల ఆత్మ గౌరవం పెరిగేలా ముఖ్య మంత్రి గిరిజన భవనం నిర్మించారు అని అన్నారు. బజారా ప్రజల తరుపున వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని కులస్తుల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నాడు అని తెలిపారు. ఈ నెల 17న గిరిజన బంజారా భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామ, మండల గిరిజన నాయకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు మోర్సింగ్, ఫ్యాక్స్ మాజీ డైరెక్టర్ జాటోత్ అమర్ సింగ్, వార్డ్ మెంబర్ ధరావత్ బిచ్చు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు జాటోత్ సోమన్న , సీనియర్ నాయకులు జాటోత్ నరసింహ, వెంకట్, హథిరాం, తదితరులు పాల్గొన్నారు.