పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ నిత్యం కొనసాగాలి

Submitted by shaikmohammadrafi on Fri, 23/09/2022 - 11:47
Parental supervision over children should continue

నడిగూడెం ,సెప్టెంబర్ 22, ప్రజా జ్యోతి: మండలం లోని కరివిరాల మోడల్ స్కూల్ లో చైల్డ్ లైన్ ఆధ్వర్యం లో షీ టీమ్ & భరోసా వారి సహకారం తో  బాలల హక్కులు , సమస్యలు, రక్షణ మార్గాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల పరిరక్షణ అధికారి మల్లేష్ మాట్లాడుతూ.. పిల్లల పరిరక్షణ అందరి బాధ్యత, సోషల్ మీడియా ను అవసరమైన మేరకు మాత్రమే వినయోగించాలని ఆయన సూచించారు.సోషల్ మీడియా లో బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరం గా ప్రవర్తిస్తే షీ-టీమ్ వారిని సంప్రదించాలిని సూచించారు. ఈ కార్యక్రమం లో షీ టీమ్ సూర్యాపేట ప్రతినిధి జ్యోతీ,  భరోసా సెంటర్ సూర్యాపేట ప్రతినిధి రజిత  మరియు నడిగూడెం పోలీస్ లు,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్  షరీఫ్, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు