సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం

Submitted by mallesh on Mon, 19/09/2022 - 11:30
Palabhishekam for CM KCR's picture

చౌటుప్పల్ సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి ../  జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 6 నుండి 10% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కటించడాని హర్షం వ్యక్తం చేస్తూ, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యాడ్ ఆవరణంలో సీఎం కేసీఆర్ చత్రపటానికి గిరిజనులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనగంటి తండా సర్పంచ్ సేవాలాల్ చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షుడు నరసింహ నాయక్ మాట్లాడుతూ గిరిజనులు ఆదివాసీల సమస్యలను తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు, ఏండ్ల తరబడి పోడు భూములను సాగు చేసుకుంటూ ,జీవనం సాగిస్తున్న గిరిజన ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చూపుతూ, 148 జీవో ద్వారా  పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన గిరిజన పక్షపతి సీఎం కేసీఆర్ ఉన్నారు. గిరిజనులకు గిరిజన బందు ఇస్తానని సీఎం కేసీఆర్ తెలిపారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు గిరిజన జాతి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, అల్మాసి పేట కృష్ణయ్య, నా రెడ్డి అభినందన్ రెడ్డి, కరెంటు మంతు నాయక్, పానుగోదు రాజు నాయక్, పంతు నాయక్, లాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.