సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by Yellaia kondag… on Tue, 20/09/2022 - 10:13
 Palabhishekam for CM KCR's film

తుంగతుర్తి సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ జీవో ప్రకటిచడంతో తుంగతుర్తి మండల పరిధిలోని దేవుని గుట్ట తండా, రావులపల్లి ఎక్స్ రోడ్డు తండా, రామన్నగూడెం తండా, గుడి తండా, సూర్య తండ పరిధిలోని గుట్ట కింది తండా గ్రామాలలో గ్రామ సర్పంచ్ ల ఆధ్వర్యంలో  సీఎం కేసీఆర్, శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్  చిత్రపటాలకు గిరిజన మహిళలు యువకులు, నాయకులు,కార్యకర్తలు,  పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పట్టుదలతో గిరిజనులకు జనాభా ప్రకారం 10% రిజర్వేషన్ పెంచాలని గట్టి నిర్ణయం తీసుకొని గిరి పుత్రుడయ్యారని అన్నారు.అదేవిధంగా గిరిజన తండాలను గ్రామపంచాయితిలుగా తీర్చి దిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుగులోతు వీరోజి, వెంకన్న, కాంతమ్మ రాములు నాయక్, భారతి పుణ్యా నాయక్, యాకు నాయక్ , రామన్నగూడెం ఎంపిటిసి ఆంగోత్ నరేష్ తో పాటు ఆయా గ్రామా శాఖల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.